Ad Code

హెచ్‌డీఎఫ్‌సీలో ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'


హెచ్‌డీఎఫ్‌సీ ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త పాలసీ తక్షణమే అమలులోకి వచ్చిందని, ప్రాథమికంగా 30 రోజుల పాటు దీన్ని పరిశీలించి, ఫలితాల ఆధారంగా ఈ విధానాన్ని కొనసాగించేది, లేనిది నిర్ణయించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారాలు వెల్లడించారు. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన రెండు ప్రధాన విభాగాలలోని ఉద్యోగులకు ఈ హైబ్రిడ్ వర్క్ మోడల్ వర్తిస్తుంది. బిజినెస్ ఎనేబుల్ ఫంక్షన్లు అంటే ట్రెజరీ ఆపరేషన్స్, క్రెడిట్ అండర్ రైటింగ్ & రిస్క్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సేవలు వంటి కీలక కార్యాచరణ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అందుబాటులో ఉంటుంది. అలాగే కార్పొరేట్ ఎనేబుల్ ఫంక్షన్లు అయిన హ్యూమన్ రీసోర్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్ & కాంప్లయన్స్, అలాగే సెక్రటేరియల్, బోర్డు విధులు నిర్వహించే అధికారులు కూడా రిమోట్‌ వర్క్‌ విధానంలో పనిచేస్తారు.  కస్టమర్లతో నేరుగా లావాదేవీలు జరిపే బ్యాంక్ బ్రాంచ్‌లు (శాఖలు), ఇతర ఫ్రంట్-ఆఫీస్ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉద్యోగుల పని విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆయా విభాగాలు ఎటువంటి అంతరాయం లేకుండా యథావిధిగా కొనసాగుతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu