బీహార్కు చెందిన 12 ఏళ్ల బాలికను ఆమె తల్లి కేవలం రూ. 16,000 మరియు 10 చీరలకు ఒక 40 ఏళ్ల వ్యక్తికి అమ్మేసిన ఘటన వెలుగుచూసింది. చందౌలీ జిల్లాకు చెందిన లాహ్రు యాదవ్ అలియాస్ రాకేష్, ఆ బాలికను తల్లి దగ్గర నుండి 'కొనుగోలు' చేసి, చహానియా ప్రాంతంలోని ఒక ఆలయంలో నకిలీ వివాహం చేసుకున్నాడు. తను యవ్వనంగా కనిపించడం కోసం ఏకంగా రూ. 90,000 ఖర్చు చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకున్నాడు. నకిలీ పెళ్లి తర్వాత, ఆ వ్యక్తి బాలికపై పదేపదే అత్యాచారానికి పాల్పడి, ఆమెను ఇంటి పనికి బలవంతం చేశాడు. గ్రామస్తుల హెచ్చరికలతో భయపడి, మే 19న ఆమెను వారణాసిలోని సారనాథ్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. బాలికను ఇంటికి చేరుస్తానని నమ్మబలికిన రవి వర్మ అనే ఆటో డ్రైవర్, ఆమెను ఒక చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి పరారయ్యాడు. మే 21న బాలిక వారణాసిలో రోదిస్తూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో అసలు విషయం బయటపడింది. పోలీసులు తల్లిని, లాహ్రు యాదవ్ను మరియు ఆటో డ్రైవర్ను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
0 Comments