ఆంధ్రప్రదేశ్ లోని అన­కా­ప­ల్లి జి­ల్లా రాం­బి­ల్లి­లో 6.5 గి­గా­వా­ట్ల రె­న్యూ సో­లా­ర్ ఇన్‌­గా­ట్-వే­ఫ­ర్ ప్లాం­ట్‌­కు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు శం­కు­స్థా­పన చే­శా­రు. అన­కా­ప­ల్లి జి­ల్లా భారీ పె­ట్టు­బ­డు­ల­తో అభి­వృ­ద్ధి­ని ఆక­ర్షి­స్తోం­ద­ని, పె­ట్టు­బ­డు­ల్లో ఈ జి­ల్లా భా­ర­త్‌­లో­నే అగ్ర­స్థా­నా­ని­కి చే­రు­తుం­ద­న్నా­రు.  గ్రీ­న్ ఎన­ర్జీ కోసం లక్షా 85 వేల కో­ట్లు ఖర్చు పె­ట్ట­బో­తు­న్నాం అని చె­ప్పా­రు. తొం­ద­ర్లో­నే ఏపీ­ఎ­స్ ఆర్టీ­సీ­కి 1050 ఈవీ బస్సు­లు వస్తా­య­ని, భవి­ష్య­త్తు­లో ఆర్టీ­సీ బస్సు­ల­న్నీ ఎల­క్ట్రి­క్ బస్సు­లు­గా మా­రు­స్తా­మ­న్నా­రు. ప్ర­తీ ఇళ్లు ఓ వి­ద్యు­త్ ఉత్ప­త్తి కేం­ద్రం­గా మా­రా­ల­ని, రై­తు­లు కూడా పొలం దగ్గ­రే వి­ద్యు­త్ ఉత్ప­త్తి చే­సు­కో­వా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు చె­ప్పు­కొ­చ్చా­రు. వి­ద్యు­త్ చా­ర్జీ­లు పెం­చ­మ­ని ఇచ్చిన హామీ ని­ల­బె­ట్టు­కు­న్నా­మ­ని, భవి­ష్య­త్తు­లో­నూ చా­ర్జీ­లు పెం­చ­మ­ని రాం­బి­ల్లి నుం­చి ప్ర­జ­ల­కు హామీ ఇస్తు­న్నా­ని సీఎం తె­లి­పా­రు. '2024 ముం­దు రా­ష్ట్రం­లో వి­ధ్వం­సం జరి­గిం­ది, అభి­వృ­ద్ది ఆగి­పో­యిం­ది. రా­ష్ట్రం­లో పె­ద్ద ఎత్తున అభి­వృ­ద్ది పను­లు జరు­గు­తు­న్నా­యి. రా­ష్ట్రం­లో పె­ట్టు­బ­డి పె­ట్ట­డా­ని­కి రీ­న్యూ ఎన­ర్జీ ముం­దు­కు వచ్చిం­ది. వి­ద్యు­త్ చా­ర్జీ­లు పెం­చ­మ­ని ఇచ్చిన హామీ ని­ల­బె­ట్టు­కు­న్నాం. అనా­లో­చిత ని­ర్ణ­యా­లు, అవి­నీ­తి కా­ర­ణం­గా వి­ద్యు­త్ వ్య­వ­స్థ కు­ప్ప­కూ­లిం­ది. గత ప్ర­భు­త్వం 32 వేల కో­ట్లు ప్ర­జ­ల­పై వి­ద్యు­త్ భారం మో­పిం­ది. 160 గిగా వా­ట్ల రె­న్యు­వ­బు­ల్ ఎన­ర్జీ ఉత్ప­త్తి లక్ష్యం­గా పని­చే­స్తు­న్నాం. ఆర్టీ­సీ­లో వె­య్యి ఈవీ బస్సు­లు రా­ను­న్నా­యి. ఆర్టీ­సీ బస్సు­లు అన్నీ ఈవీ బస్సు­లు­గా వస్తా­యి. పేద వా­ళ్ల­కు ఈ సౌ­క­ర్యం అం­దు­బా­ట­లో­కి తే­వ­డం కోసం పని­చే­స్తు­న్నాం. ప్ర­తీ ఇల్లు వి­ద్యు­త్ ఉత్ప­త్తి కేం­ద్రం­గా మా­రా­లి. అవ­స­రా­లు తీ­రిన తర్వాత తి­రి­గి గ్రి­డ్ కు ఇచ్చే స్థా­యి­కి వె­ళ్ళా­లని చంద్రబాబు అన్నారు. వై­ఎ­స్సా­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ కి­ల్ల­ర్ పా­ర్టీ అని, ఆ పా­ర్టీ­లో­ని కొం­ద­రు నా­య­కు­లు సొంత వా­ళ్ల­నూ చం­పే­స్తా­ర­ని సీఎం చం­ద్ర­బా­బు సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. వై­ఎ­స్ వి­వే­కా­నం­దా­రె­డ్డి, వై­సీ­పీ నేత పె­ద్ద దస్త­గి­రి­హ­త్య­ల­ను ఉద్దే­శిం­చి ఆయన కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. వై­ఎ­స్సా­ర్ కాం­గ్రె­స్ నా­య­కు­లే చం­పే­స్తా­ర­ని, ఆ తర్వాత కూడా పరా­మ­ర్శ­లు కూడా వా­ళ్లే చే­స్తా­ర­ని తె­లి­పా­రు. నే­ర­స్తు­లైన ప్ర­తి­ప­క్ష నా­య­కు­ల­తో తాను రా­జ­కీ­యా­లు చే­స్తు­న్నా­న­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు.సొం­త­పా­ర్టీ నే­త­ల­ను చంపే పా­ర్టీ వై­ఎ­స్సా­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ అని వి­మ­ర్శిం­చా­రు. రా­ష్ట్రం­లో హత్యా­రా­జ­కీ­యా­ల­ను వై­సీ­పీ ప్రో­త్స­హి­స్తోం­ద­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. ఎమ్మె­ల్సీ అనం­త­బా­బు హత్య చేసి డోర్ డె­లి­వ­రీ చే­శా­ర­ని, అం­తే­కా­కుం­డా సా­క్షు­ల­ను సైతం డబ్బు­లి­చ్చి ప్ర­లోభ పె­ట్టే ప్ర­య­త్నం చే­శా­ర­ని మం­డి­ప­డ్డా­రు. ఇవి పాత రో­జు­లు­కా­వ­ని, తప్పు చే­స్తే ఎం­త­టి­వా­రి­కై­నా శి­క్ష తప్ప­ద­ని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు హె­చ్చ­రిం­చా­రు. 2019-24 మధ్య ఏపీ­లో వి­ధ్వం­సం జరి­గిం­ద­ని వి­మ­ర్శిం­చా­రు. వి­ద్యు­త్‌ రం­గా­న్ని వై­సీ­పీ కు­ప్ప­కూ­ల్చిం­ద­ని మం­డి­ప­డ్డా­రు. జగ­న్‌ పా­ల­న­లో వి­ద్యు­త్‌ ఛా­ర్జీ­లు పెం­చా­ర­ని.. ఉచి­తం­గా కరెం­ట్‌ వచ్చే సో­లా­ర్‌­ను వి­ని­యో­గిం­చు­కో­లే­ద­న్నా­రు. వి­ద్యు­త్‌ సం­స్థ­ల­పై రూ.12 వేల కో­ట్ల భారం మో­పా­ర­న్నా­రు. వై­సీ­పీ హయాం­లో పరి­శ్ర­మ­లు వె­న­క్కి­పో­యా­య­ని సీఎం అన్నా­రు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నామని, భవిష్యత్తులో ఆర్టీసీలో కేవలం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సామాన్యుడికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని చేరువ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏసీ బస్సుల్లో కేవలం డబ్బున్న వారు మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు. పేద ప్రజలు కూడా ఎంతో గౌరవంగా, హాయిగా ఏసీ బస్సుల్లో ప్రయాణించాలన్నదే తన కొరిక అని తెలిపారు.