హైదరాబాద్, రామంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు అధిక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రులు ఆదోళన చేస్తున్నారు. 2వ నుంచి 5వ తరగతుల ఫీజులు 140% వరకు, 6వ నుంచి 10వ తరగతుల ఫీజులు 84% వరకు పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రామంతపూర్ మెయిన్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది.
0 Comments