Ad Code

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో 'భరోసా పత్రం' విడుదల


శ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డెబ్రాలో జనసమీకరణలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఖరగ్‌పూర్‌లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. బెంగాల్ గడ్డపై కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనికి 'సంకల్ప పత్రం' కాకుండా 'భరోసా పత్రం' అని నామకరణం చేయడం విశేషం. నిరుద్యోగ యువతకు భృతి, మహిళలకు ఆర్థిక సాయం, అవినీతిపై ఉక్కుపాదం వంటి కీలక హామీలతో కూడిన ఈ పత్రాన్ని బెంగాల్ అభివృద్ధికి రోడ్ మ్యాప్‌గా అమిత్ షా అభివర్ణించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ప్రధానాంశాలను అమిత్ షా ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3000 చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. అలాగే కోటి మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద మహిళల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెలా రూ. 3000 జమ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న డీఏ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనను 'చీకటి రాత్రి'తో పోల్చిన అమిత్ షా, గత 15 ఏళ్లలో జరిగిన అరాచకాలపై తాము యుద్ధం ప్రకటిస్తామని చెప్పారు. బెంగాల్ ప్రజలు మమతా దీదీకి మూడుసార్లు అవకాశం ఇచ్చారు. కానీ ఆమె ప్రజల ఆశలను వమ్ము చేశారు. ఇప్పుడు బెంగాల్ ప్రజలు నిరాశలో ఉన్నారు. ఈ భరోసా పత్రం వారిని నిరాశ నుంచి బయటపడేసే మార్గమని అమిత్ షా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి పొందడానికి బెంగాల్ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ఈ మేనిఫెస్టోను కేవలం వాగ్దానాల పత్రంగా కాకుండా, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే 'భరోసా పత్రం'గా ప్రచారం చేస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu