ఇజ్రాయెల్ తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రకటించారు. పశ్చిమాసియాలో ప్రస్తుత అశాంతికి, ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. యుద్ధాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మెలోని, గాజాలో జరుగుతున్న ప్రాణనష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా వేలాది మంది అమాయకులు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని ఆమె పేర్కొన్నారు. "శాంతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది, కానీ ఇజ్రాయెల్ చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి" అని ఆమె స్పష్టం చేశారు.
0 Comments