Ad Code

లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపునకు కేంద్రం సన్నాహాలు !


దేశ జనాభా పెరుగుదలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీని ప్రకారం రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలను కేటాయించనున్నారు. ఈ మార్పులను అమలు చేయడానికి వీలుగా రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డెలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2026 అనే మూడు ప్రధాన బిల్లుల ముసాయిదాలను ప్రభుత్వం ఇప్పటికే ఎంపీలకు పంపింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం ఈ బిల్లులు కమిటీల పరిశీలనకు, ఇతర చట్టపరమైన ప్రక్రియలకు వెళ్లనున్నాయి. త్వరలోనే వీటిని ఆమోదించి అమలులోకి తీసుకురావాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu