దేశీయ మార్కెట్లో ఏప్రిల్ 13న షావోమీ రెడ్మి 'A' సిరీస్లో సరికొత్త 5G ఫోన్ రెడ్మి A7 ప్రో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో దీని 4G వెర్షన్ విడుదలవ్వగా ఇప్పుడు భారత్ లో పవర్ ఫుల్ 5G వెర్షన్ ను లాంచ్ చేస్తున్నారు. "కింగ్ ఆఫ్ పవర్ అండ్ స్టైల్" అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ ఫోన్, బడ్జెట్ సెగ్మెంట్లో అదిరిపోయే ఫీచర్లతో రాబోతుంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీ. రెడ్మి A7 ప్రో 5Gలో 6,300mAh బ్యాటరీని అమర్చారు. ఈ విభాగంలో అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్గా ఇది నిలవనుంది. అలాగే ఇందులో ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ను ఉపయోగించారు. ఈ సెగ్మెంట్లోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ ఇదని కంపెనీ పేర్కొంటోంది. ఇక డిస్ప్లే పరంగా కూడా రెడ్మి రాజీ పడలేదు. ఈ స్మార్ట్ఫోన్లో అత్యంత స్మూత్ రిఫ్రెష్ రేట్ కలిగిన ప్యానెల్ను అందించారు. సాఫ్ట్వేర్ పరంగా ఇందులో సరికొత్త "షావోమీ హైపర్ ఐలాండ్" ఫీచర్ ను పరిచయం చేస్తున్నారు. ఇది ఫ్రంట్ కెమెరా నాచ్ వద్ద నోటిఫికేషన్లు, లైవ్ యాక్టివిటీస్, ముఖ్యమైన సిస్టమ్ సమాచారాన్ని డైనమిక్గా చూపిస్తుంది. ఐఫోన్లలో ఉండే డైనమిక్ ఐలాండ్ తరహాలో ఇది వినియోగదారులకు సులభమైన యాక్సెస్ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 32MP డ్యూయల్ AI కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఈ ఫోన్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫోటో ప్రాసెసింగ్ కోసం "కింగ్స్ AI నైట్స్" పేరుతో ప్రత్యేక టూల్స్ను తీసుకొచ్చారు. వీటితో పాటు గూగుల్ సంబంధిత ప్రముఖ "సర్కిల్ టు సెర్చ్" ఫీచర్ ను కూడా ఇందులో చేర్చారు. దీని ద్వారా స్క్రీన్పై ఏదైనా కంటెంట్ను హైలైట్ చేయడం ద్వారా యాప్స్ మారకుండానే నేరుగా వెతకవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ డిజైన్ చాలా స్టైలిష్గా ఉండటమే కాకుండా, ఫిజికల్ డ్యూరబిలిటీ విషయంలో కూడా రాజీ పడలేదు. దీని నిర్మాణాన్ని "ట్యాంక్ లాంటి బిల్డ్" గా కంపెనీ అభివర్ణించింది. అంటే రోజువారీ వాడకంలో తలెత్తే ఒత్తిడిని, పడిపోవడాన్ని ఇది తట్టుకోగలదు.
0 Comments