ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు ఈరోజు కాసుల వర్షం కురిపించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1264 పాయింట్లు పెరిగి 78,111 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 389 పాయింట్లు లాభపడి 24,231 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ ప్రారంభం నుండి ముగింపు వరకు కొనుగోళ్ల జోరు కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక కీలక ప్రకటన మార్కెట్ల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. శాంతి చర్చల వార్త దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపడంతో అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు, ఒక్కసారిగా కోలుకోవడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.
0 Comments