పంజాబ్ లోని అమృత్సర్కు చెందిన శ్రీ రామ్ ఆశ్రమ్ పాఠశాల విద్యార్థి అయిన ముదిత్ జైన్ సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 500కి 500 మార్కులు సాధించి చరిత్ర సృష్టించాడు. తన ప్రిపరేషన్ మొత్తాన్ని ఎలాంటి బయటి సహాయం లేకుండా పూర్తి చేశాడు. తాను కేవలం తన పాఠశాల చదువు, స్వీయ అధ్యయన నోట్సుపైనే ఆధారపడ్డానని ముదిత్ చెబుతున్నాడు. క్రమమైన అధ్యయనం, సరైన సమయ నిర్వహణే అతడిని ఈ స్థాయికి చేర్చాయి. ముదిత్ , పరీక్షలలో రాణించడమే కాకుండా, సర్వతోముఖ ప్రజ్ఞాశాలి అయిన వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. అతను జాతీయ స్థాయి ఒలింపియాడ్లు, మోడల్ యునైటెడ్ నేషన్స్ వంటి పోటీలలో అత్యంత చురుకుగా పాల్గొంటాడు. రోబోటిక్స్, సాంకేతిక విషయాల పట్ల కూడా ఆసక్తి ఉంది. ముదిత్లోని ఈ గుణం, అతనికి పుస్తక జ్ఞానంతో పాటు ప్రపంచంపై ఆచరణాత్మక అవగాహన కూడా ఉందని చూపిస్తుంది. ముదిత్ సాధించిన అద్భుతమైన విజయంలో అతని కుటుంబం కీలక పాత్ర పోషించింది. తల్లి పరుల్ జైన్, అతను చదువుతున్న అదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. పాఠశాలలో ఆమె ఉండటం ముదిత్ కి కీలకమైన మార్గదర్శకత్వాన్ని అందించింది . కోటక్ మహీంద్రా బ్యాంకులో పనిచేస్తున్న తండ్రి, రజనీష్ జైన్, ముదిత్ ఒక ప్రతిభావంతుడైన ఇంజనీర్ కావాలని కలలు కంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
0 Comments