Ad Code

కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకొంది. కదులుతున్న రథం చక్రాల కింద ఐదుగురు భక్తులు పడినట్టు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న అధికారులు, దేవస్థానం సిబ్బంది గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో రథోత్సవం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. 

Post a Comment

0 Comments

Close Menu