Ad Code

తేనెటీగల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ సమీపంలో తేనెటీగల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఒక కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. మృతుడిని శ్రీశైలం డ్యామ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (52)గా గుర్తించారు. వీరస్వామి విధి నిర్వహణలో ఉన్న సమయంలో తేనెటీగల గుంపు అకస్మాత్తుగా ఆయనపై దాడి చేసింది. తేనెటీగలు ఆయనను పదేపదే కుట్టడంతో, వీరస్వామి సురక్షిత ప్రాంతానికి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయినట్లు తెలిసింది.

Post a Comment

0 Comments

Close Menu