తెలంగాణలోని వరంగల్ నగరం 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో అబ్బరబోయిన రాజు అనే వ్యక్తి తన భార్య అనిత (40) పై రోకలి బండతో దాడి చేసి ప్రాణాలు తీశాడు. చిన్ననాన్న కర్మకాండలకు వెళ్లి వచ్చిన అనితతో, భర్త రాజు గొడవకు దిగడం ఈ దారుణానికి దారితీసింది. స్థానికులు వెంటనే అనితను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments