హైదరాబాద్లోని మియాపూర్లో తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో అలీషా అలియాస్ పాండు, తన తండ్రి లాలూతో కలిసి నూకరత్నం (25) అనే యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. దాడి అనంతరం స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
0 Comments