Ad Code

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ : రెండవ వ స్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధానా


సీసీ మహిళల టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా తన 2వ స్థానాన్ని నిలబెట్టుకోగా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచింది. భారత్‌ కు చెందిన మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 6వ స్థానంలోనే కొనసాగుతూ టాప్-10లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక జెమిమా రోడ్రిగ్స్ మాత్రం 11వ స్థానంతో సరిపెట్టుకుంది. బౌలింగ్ విభాగంలో మాత్రం ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకుంది. అంతేకాదు.. ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా ఆమె మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈమె తర్వాత ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ ఆరవ స్థానాన్ని నిలబెట్టుకోగా.. అరుంధతి రెడ్డి ఒక స్థానం కోల్పోయి 11వ స్థానానికి చేరుకుంది. ఇక బ్యాటర్స్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మోని 793 పాయింట్స్ తో తన మొదటి స్థానాన్ని కాపాడుకుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పాకిస్థాన్ ప్లేయర్ సాదియా ఇక్బాల్ 743 పాయింట్స్ తో తన మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక వెస్టిండీస్ ప్లేయర్ హేలె మ్యాత్యుస్ 465 పాయింట్స్ తో మొదటి తనంలో కొనసాగుతుంది. ఇక 294 రేటింగ్ పాయింట్స్ తో ఆస్ట్రేలియా జట్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండగా.. 268 రేటింగ్ పాయింట్స్ తో టీమిండియా జట్టు ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో కొనసాగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu