Ad Code

ప్రధాన మంత్రి సీటును చుట్టుముట్టి కాంగ్రెస్ మహిళా ఎంపీలు : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ఖాతాలో వీడియోను విడుదల


లోక్ సభలో ప్రధాన మంత్రి కూర్చున్న సీటును కాంగ్రెస్ మహిళా ఎంపీలు చుట్టుముట్టి నిరసన తెలిపిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ఖాతాలో విడుదల చేస్తూ తన ఎంపీల ఇటువంటి తక్కువ స్థాయి ప్రవర్తనను చూసి కాంగ్రెస్ పార్టీ గర్వపడుతోందంటూ ఎద్దేవా చేశారు. ఈనెల నాలుగో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇస్తారని భావించిన సమయంలో, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని సీటు వద్దకు చేరుకున్నారు. "సరైన పని చేయండి" అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల వల్ల ప్రధానిని సభకు రావద్దని సూచిస్తూ స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. కాంగ్రెస్ సభ్యులు ప్రధాని సీటు వద్దకు చేరుకుని ఏదో అనుకోని ప్రమాదం లేదా అవాంఛనీయ ఘటన చేయాలని ప్లాన్ చేశారని స్పీకర్ కూడా ఆరోపించారు. అయితే, ప్రధాని పార్లమెంటును ఎదుర్కోవడానికి భయపడుతున్నారని, అందుకే ప్రసంగాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. కిరణ్ రిజిజు విమర్శలు: "కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తన అత్యంత అవమానకరంగా ఉంది. మేమే గనుక బీజేపీ మహిళా ఎంపీలను అడ్డుకోకుండా కాంగ్రెస్ ఎంపీలను ఎదుర్కోవడానికి అనుమతించి ఉంటే, పరిస్థితి చాలా అసహ్యంగా ఉండేది. పార్లమెంటు గౌరవాన్ని, పవిత్రతను కాపాడటంపై మాకు అత్యంత శ్రద్ధ ఉంది" అని రిజిజు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu