Ad Code

ప్రయాణీకులకు కలిగే ఇబ్బందులకు ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించాలి !


యిర్‌లైన్స్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను పార్లమెంటులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఎండగట్టారు. “ప్రయాణీకుల బ్యాగ్ కేవలం ఒక కిలో ఎక్కువ బరువు ఉన్నా ఎయిర్‌లైన్స్ వెంటనే అదనపు డబ్బులు వసూలు చేస్తాయి. కానీ అదే విమానం మూడు గంటలు ఆలస్యంగా వచ్చినప్పుడు ఎయిర్‌లైన్స్ ఎందుకు మౌనంగా ఉంటాయి? ప్రయాణీకుల సమయానికి విలువ లేదా?” అని ఆయన నిలదీశారు. ప్రయాణీకులకు కలిగే ఇబ్బందులకు ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ప్రయాణీకుడు ఆలోచించే ఈ నిజమైన ప్రశ్న పార్లమెంటులో ప్రతిధ్వనించింది. విమానయాన సంస్థలు తమ సేవల్లో లోపాలు ఉన్నప్పుడు ప్రయాణీకులకు తగిన పరిహారం లేదా ప్రత్యామ్నాయ వసతులు కల్పించేలా నిబంధనలు మరింత కఠినతరం కావాల్సిన అవసరం ఉందని ఈ చర్చ ద్వారా స్పష్టమైంది.

Post a Comment

0 Comments

Close Menu