బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ సోదాల సందర్భంగా జనవరి 30న ఆత్మహత్య చేసుకున్న కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, రియాల్టీ షోల నిర్వాహకుడు సీజే. రాయ్ మరణంపై న్యాయ విచారణ జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు. ఈ సంఘటన 'దేశ పన్ను పరిపాలనపై మచ్చ''గా అభివర్ణించారు. సోదాల సమయంలో జరిగిన విధానపరమైన లోపాల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నప్పుడు రాయ్ ఎలా లోడ్ చేసిన తుపాకీని పొందగలిగారని ప్రశ్నించారు. ''ప్రోటోకాల్ యొక్క తీవ్రమైన వైఫల్యం.''గా పేర్కొన్నారు. ఐటీ అధికారులు వేధించారని రాయ్ సోదరుడు చేసిన ప్రకటనలను గుర్తుచేశారు. ఐటీ అధికారులు కుటుంబాన్ని వేధించారని చేసిన ఆరోపణలను కూడా సీఎం హైలైట్ చేశారు. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని నిష్పాక్షిక న్యాయ విచారణ మాత్రమే పూర్తి సత్యాన్ని బయటకు తీసుకురాగలదని చెప్పారు. కర్ణాటక పోలీసుల దర్యాప్తును అంగీకరిస్తున్నామని, పరిపాలనా విధానాలు, తగిన శ్రద్ధ, అధికారుల ప్రవర్తనను పరిశీలించడానికి విస్తృత దర్యాప్తు అవసరమని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు. ఆలస్యం లేకుండా విచారణకు ఆదేశించాలని, కాలపరిమితి నివేదికను సమర్పించాలని కేంద్రాన్ని కోరారు. గత శుక్రవారం బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. అదే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లైసెన్స్డ్ తుపాకీతో ఛాతీలో కాల్చుకుని సీజే.రాయ్ ప్రాణాలు తీసుకున్నారు. సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీజే రాయ్కు భార్య లిని రాయ్, కుమారుడు రోహిత్, కుమార్తె రియా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా విదేశాల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అశోక్నగర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments