బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆయనతో పాటు పలువురు క్యాబినెట్ మంత్రులతో ప్రమాణం చేయించారు. రాజధాని నగరం ఢాకాలో ఈ కార్యక్రమం జరిగింది. బంగ్లా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లాదేశ్లో గత 35 ఏళ్లుగా మహిళలే ప్రధానులుగా కొనసాగారు. ఇప్పుడు బీఎన్పీ ఛైర్మన్గా ఉన్న తారిఖ్ రెహమాన్ 35 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిష్ఠించిన పురుష ప్రధానిగా నిలిచారు.
0 Comments