Ad Code

హనీ ట్రాప్ చేసి రూ.25 కోట్ల పాయల డిమాండ్‌ చేసింది : నిరూపించాలని బాధితురాలు ఛాలెంజ్‌


ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బాధితురాలు హనీ ట్రాప్ చేసిందని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. 25 కోట్ల రూపాయల డిమాండ్‌ చేసిందని ఆరోపించారు. మరోవైపు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యానని బాధితురాలు మాయమాటలు చెప్పి, తమ దగ్గర డబ్బు వసూలు చేసినట్టు, పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో ఎమ్మెల్యే తల్లి ప్రమీల పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు విడుదల చేశారు. యూపీఎస్సీలో సెలక్ట్ అయ్యానని చెప్పి ఫేక్ ఇంటర్వ్యూ లెటర్‌, సివిల్స్ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ హాల్ టికెట్ బాధితురాలు చూపించిందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను తాను హనీ ట్రాప్‌ చేస్తే ఏడాదిన్నర బాధ పడాల్సిన అవసరం లేదని బాధితురాలు అన్నారు. ఒక్క రోజులో హనీ ట్రాప్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేయొచ్చని, తాను ఆ పని చేయలేదన్నారు. తనకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందో డాక్టర్లు తేలుస్తారని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. తనకు శ్రీధర్‌కు మధ్య జరిగిన వ్యవహారం గురించి మాట్లాడకుండా, టాపిక్‌ను జనసేన నేత నాగేంద్ర డైవర్ట్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితురాలు మరో వీడియో రిలీజ్‌ చేశారు. ఇంత రచ్చ జరుగుతున్నా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని బాధితురాలు ప్రశ్నించారు. తాను హనీ ట్రాప్‌ చేసి 25 కోట్ల రూపాయలు అడిగానని నిరూపించాలని ఎమ్మెల్యే వర్గానికి ఛాలెంజ్‌ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu