తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశమై కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ భేటీకి ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది.
0 Comments