అమెరికాలోని మైన్ ప్రాంతంలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక చిన్న ప్రయాణికుల విమానం రన్వేపై క్రాష్ అయి ఒక్కసారిగా బోల్తా పడింది. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, రన్వేను పూర్తిగా మూసివేశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విషయంలో తెలియగానే ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానాశ్రయం వైపు ఎవరూ రావద్దని అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను కోరారు. ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ 'ఫ్లైట్ రాడార్ 24' అందించిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన విమానం బాంబార్డియర్ ఛాలెంజర్ 600 రకానికి చెందినది. ఈ ప్రైవేట్ జెట్ హ్యూస్టన్ నుండి బాంగోర్ విమానాశ్రయానికి చేరుకుందని, తిరిగి టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని ఏడీఎస్-బి సిగ్నల్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ విమానం హ్యూస్టన్కు చెందిన ఒక కంపెనీ పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్లు ఫెడరల్ రికార్డులు తెలియజేస్తున్నాయి.ఈ ప్రైవేట్ జెట్లో ఎనిమిది మంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని సీఎన్ఎన్ తెలిపింది.
0 Comments