దేశీయ మార్కెట్లో థామ్సన్ కంపెనీ కొత్త 32 అంగుళాల QLED HD రెడీ స్మార్ట్ TVని JioTele OSతో విడుదల చేసింది. ఈ మోడల్ ప్రత్యేకంగా బడ్జెట్-ఫ్రెండ్లీ వినియోగదారులను లక్ష్యంగా ఈ స్మార్ట్ టీవీ ని రూపొందించింది. 350 నిట్స్ బ్రైట్నెస్, HDR సపోర్ట్ కలిగిన QLED ప్యానెల్ ద్వారా మెరుగైన రంగులు , కాంట్రాస్ట్ అందిస్తూ 36W శక్తివంతమైన స్పీకర్లతో డాల్బీ ఆడియో అనుభవం ఇస్తుంది. JioTele OS ద్వారా 400+ ఉచిత లైవ్ ఛానెల్స్, 300+ JioGames, అలాగే Netflix, YouTube, Prime Video వంటి OTT యాప్లకు షార్ట్కట్ కీస్ అందుబాటులో ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్ , మల్టీలాంగ్వేజ్ సెర్చ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ TV 10 వెలలోపు ధరలో వినియోగదారులకు అందిస్తున్న ఈ సామ్రాట్ టీవీ 2026 జనవరి 22 నుండి ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభ్యం అవుతుంది. 80 సెం.మీ QLED స్క్రీన్తో ఇది HD Ready రిజల్యూషన్ (1366 × 768 పిక్సెల్స్) తో అందిస్తుంది. 350 నిట్స్ బ్రైట్నెస్ వల్ల రంగులు మరింత స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. బెజెల్-లెస్ డిజైన్ వల్ల స్క్రీన్ పెద్దగా, స్టైలిష్గా కనిపిస్తుంది. ఆడియో 2 స్పీకర్లతో 36W సౌండ్ అవుట్పుట్ తో డాల్బీ ఆడియో టెక్నాలజీతో థియేటర్ ఫీల్ అందిస్తుంది. స్పోర్ట్స్ మోడ్ వంటి ప్రత్యేక ఆడియో సెట్టింగ్స్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంది. Amlogic ప్రాసెసర్ 1GB RAM , 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.JioTele ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.ఇందులో వాయిస్ అసిస్టెంట్, మల్టీలాంగ్వేజ్ సెర్చ్, Netflix, Prime Video, YouTube లాంటి OTT షార్ట్కట్ కీస్ ఉన్నాయి. అదనంగా దీనిలో 400+ ఉచిత లైవ్ ఛానెల్స్, 300+ JioGames, వెబ్ బ్రౌజర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Wi-Fi, Bluetooth, 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, AV ఇన్పుట్, ఇథర్నెట్ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
దీని ధర ₹9,499గా ఉంది.
0 Comments