ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సిరి గుండెపోటుతో మృతిచెందింది. క్లాస్రూమ్లో పాఠాలు వింటుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన టీచర్లు, ఇతర సిబ్బంది హుటాహుటిన సిరిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా ధ్రువీకరించారు. గుండెపోటుతోనే ఆమె మరణించినట్లుగా వైద్యులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments