తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. అయ్యర్పాడి తేయాకు ఎస్టేట్లో పనిచేస్తున్న అస్సాం వలస కార్మికుడి కుమారుడైన సైఫుల్ (5) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని పొదల నుంచి ఆకస్మాత్తుగా దూసుకొచ్చిన చిరుతపులి బాలుడిని పట్టుకుని లాక్కెళ్లిపోయింది. తోట లోని కార్మికులు, అటవీ శాఖ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన కాసేపటి తర్వాత తోట లోపలి భాగంలో సైఫుల్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఏడాది ఆగస్టు 11న ఇదే ప్రాంతంలోని కావరకల్లు వద్ద నూర్జిల్ హక్ (8) అనే బాలుడు, జూన్ 22న పచ్చమలై వద్ద రోషిణి (4) అనే బాలిక చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
0 Comments