ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా సుమారు 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 230 కోట్ల వ్యయంతో నిర్మించిన 'రాష్ట్రీయ ప్రేరణా స్థల్'ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశాన్ని తాకేలా నిలుచున్న మూడు భారీ కాంస్య విగ్రహాలు ఈ స్మారక చిహ్నంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిల 65 అడుగుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి.
0 Comments