Ad Code

తెలుగుదేశం పార్టీ కొత్త జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల


తెలుగుదేశం పార్టీ కొత్త జిల్లా అధ్యక్షుల జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. గ్రామ, మండల, జిల్లాల వారీగా కమిటీల నియామకం పూర్తైనప్పటికీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ఎంపిక మాత్రం గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఎట్టకేలకు ఖరారు అయ్యాయి. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లను, ప్రధాన కార్యదర్శులను ఆ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాకు అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంతో టీడీపీ అధిష్టానం కొత్త జిల్లా అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. జిల్లా అధ్యక్షుల నియామకం కోసం టీడీపీ అధిష్టానం త్రీమెన్ కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. ఈ త్రీసభ్య కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను సేకరించాయి. అనంతరం పార్టీ అధిష్టానానికి నివేదికలు సమర్పించాయి. త్రీసభ్య కమిటీల నివేదికలపై ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం జిల్లా అధ్యక్షుల ఎంపికపై చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. ఇటీవలే కొంతమందికి ఫోన్లు కూడా చేసి ఈ విషయాన్ని తెలియజేశారంటూ వార్తలు వచ్చాయి. అలాగే ఓ జాబితా కూడా సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లా అధ్యక్షులను టీడీపీ అధికారికంగా ప్రకటించింది. సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, సామర్థ్యం, అనుభవం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. చంద్రబాబు నాయుడు ఈ జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు.

జిల్లాల వారీగా అనకాపల్లి - బత్తుల తాతయ్య బాబు, అరకు- మోజోరు తేజోవతి, శ్రీకాకుళం - మోదవలస రమేశ్, విశాఖ- చోడే వెంకట పట్టాభిరాం, విజయనగరం - కిమిడి నాగార్జున, బాపట్ల - రాజశేఖర్ బాబు, గుంటూరు - పిల్లి మాణిక్యరావు, మచిలీపట్నం - వీరంకి గురుమూర్తి, నర్సరావుపేట - షేక్ జాన్ సైదా, విజయవాడ - గద్దె అనురాధ, అమలాపురం - గుత్తల సాయి, ఏలూరు- బడేటి రాధాకృష్ణ, కాకినాడ- జ్యోతుల నవీన్, నర్సాపురం - మంతెన రామరాజు, రాజమండ్రి - బొడ్డు వెంకటరమణ చౌదరి, అనంతపురం - పూల నాగరాజు, హిందూపురం - ఎం.ఎస్. రాజు, కడప- చదిపిరాళ్ల భూపేష్, కర్నూలు- గుడిశె కృష్ణమ్మ, నంద్యాల- గౌరు చరితా రెడ్డి, చిత్తూరు - షణ్ముగ రెడ్డి, నెల్లూరు- బీద రవిచంద్ర, ఒంగోలు- ఉగ్ర నరసింహారెడ్డి, రాజంపేట - సుగవాసి ప్రసాద్, తిరుపతి - పనబాక లక్ష్మి. 

Post a Comment

0 Comments

Close Menu