హైదరాబాద్ లోని శంషాబాద్లో ఓ ప్రయాణికుడిపై దాడి చేసి రూ. 50 వేల నగదు, సెల్ఫోన్ ను ఆటో డ్రైవర్, మరో నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బంధువుల ఫంక్షన్ కోసం సత్యనారాయణ అనే వ్యక్తి మహబూబ్నగర్ నుంచి శంషాబాద్కు వచ్చారు. ఈ క్రమంలోనే శంషాబాద్ బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఆటో రావడంతో ఆటో ఎక్కారు. కొంత దూరం వెళ్లాక ఆటో డ్రైవర్, మరో నలుగురు వ్యక్తులు సత్యనారాయణపై దాడి చేసి డబ్బుతో పరారీ అయ్యారు. బాధితుడు ఫిర్యాదుతో శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఆటో నంబర్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
0 Comments