Ad Code

హిందూ మహిళలు బతికి ఉండగానే వీలునామా రాయాలి : సుప్రీంకోర్టు


హిళలు తమ మరణానంతరం ఆస్తిపై వివాదం లేకుండా ఉండాలంటే వారు బతికి ఉండగానే ఆస్తి ఎవరికి చెందాలనే విషయంలో స్పష్టంగా వీలునామా రాయాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళకు పిల్లలు లేకపోతే ప్రస్తుత హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తి మొదటగా భర్త కుటుంబానికి వెళ్లే అవకాశం ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. కానీ చాలా సందర్భాల్లో ఆస్తి విషయమై మహిళ పుట్టింటి వాళ్లకు, అత్తింటి వారికి మధ్య వివాదాలు చెలరేగుతున్నాయని పేర్కొంది. వివాహానంతరం మహిళ గోత్రం మారుతుందన్న సంప్రదాయ అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావిస్తూ వివాహం తర్వాత మహిళపై ప్రధాన బాధ్యత భర్త కుటుంబానిదే అవుతుందని పేర్కొంది. కానీ పిల్లలు లేని మహిళల ఆస్తుల విషయంలో, విడాకులు తీసుకోకుండా భర్తకు దూరంగా ఉంటున్న మహిళల ఆస్తుల విషయంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా వారసత్వ హక్కుల్లో తలెత్తే సమస్యలు పరిష్కరించేందుకు ప్రీ-లిటిగేషన్ మిడియేషన్ (మధ్యవర్తిత్వం) తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యవర్తిత్వంలో వచ్చే ఒప్పందాలను కోర్టు తీర్పుగా పరిగణించాలని తెలిపింది. కొంతమంది న్యాయవాదులు ప్రస్తుత వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(1)(బి) వివక్షాత్మకమని అభిప్రాయపడుతున్నారని, దాన్ని మార్చాలంటే చట్టసవరణ చేయాలని, అది పార్లమెంట్ చేయాల్సిన పని అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu