Ad Code

ఏటీఎంలో నగదు తరలించే వాహనంలోని రూ.7.11 కోట్ల నగదును దోపిడీ చేసిన దుండగులు


బెంగళూరులోని డైరీ సర్కిల్ వద్ద పట్టపగలు భద్రతా సిబ్బందిని మోసగించి ఏటీఎంలో నగదు తరలించే వాహనంలోని రూ.7.11 కోట్ల నగదుతో ఉడాయించారు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నగరంలోని డైరీ సర్కిల్ వద్దగల ఓ ఏటీఎం మెషీన్‌లో నగదు డిపాజిట్ చేసేందుకు గానూ వాహనంలో బ్యాంక్ సిబ్బంది క్యాష్‌తో బయల్దేరారు. ఇంతలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉన్న ఓ ఇన్నోవా వాహనంలో దుండగులు వచ్చి తాము ఆర్‌బీఐ అధికారులమని చెబుతూనే సిబ్బందిని మోసగించి వాహనంలోని నగదును దోచుకెళ్లారు. చోరీకి గురైన సమయంలో అందులో రూ.7.11 కోట్ల క్యాష్ ఉందని సదరు సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందంతో దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu