దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హెచ్చరించింది. ఎలాంటి అనుమతులు లేకుండానే డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నయని ఈ సంస్థలు జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని పేర్కొంది. వీటిలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా తొమ్మిది నకిలీ యూనివర్సిటీలు ఉండగా ఐదు యూపీలో ఉన్నాయని, మిగతావి కేరళ, పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిలో నిర్వహిస్తున్నట్లు యూజీసీ తెలిపింది. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరే ముందు ఆ సంస్థ యూజీసీ గుర్తించిన జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది.
0 Comments