2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్లోకి చొరబడి దారుణమై దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ లను టార్గెట్ చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా దారుణంగా చంపేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా, 251 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం హమాస్ లక్ష్యంగా గాజాతో పాటు ఇతర పాలస్తీనా భూభాగాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 45 వేలకు పైగా ప్రజలు మరణించారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 7న కిబ్బట్జ్ నిర్ ఓజ్ దాడికి నాయకత్వం వహించిన హమాస్ కమాండర్ ని హతమార్చినట్లు ఇజ్రాయిల్ ధృవీకరించింది. అబ్ద్ అల్- హదీ సబా అనే వ్యక్తి హమాస్ నుఖ్బా ఫ్లాటూన్ కమాండర్ గా వ్యవహరించాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హమాస్ ముఖ్బా ప్లాటూన్ కమాండర్, అబ్ద్ అల్-హదీ సబా ఇటీవలి డ్రోన్ దాడిలో హతమైనట్లు ధృవీకరించింది.
0 Comments