ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైమ్ స్టోన్ లీజుల విషయంలో పున సమీక్షిస్తోంది. అందులో భాగంగా మై హోమ్ గ్రూపునకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని భావిస్తోంది. వైసిపి ప్రభుత్వం అనంతపురం తో పాటు చాలాచోట్ల లైమ్ స్టోన్ లీజులను 50 ఏళ్ల వరకు మై హోమ్ గ్రూపునకు కేటాయించింది. వీటిని రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మై హోమ్ గ్రూపునకు చెందినదే టీవీ 9. గత ఐదేళ్లుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించింది ఈ మీడియా. మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, ఆయన కుమారుడు టీవీ9 మీడియాను వైసీపీకి అప్పగించినట్లు విమర్శ ఉంది. దాని ప్రతిఫలంగా రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలు లీజులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా టీవీ9 తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ కు వ్యతిరేకంగా కథనాలు వెలువరించింది. గ్రూప్ చైర్మన్ రామేశ్వరం తో పాటు ఆయన కుమారుడు చంద్రబాబును కలిసి లీజులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేనట్లు సమాచారం. గతం మాదిరిగా చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదు. ఈ విషయంలో పార్టీ యువ నాయకత్వం ఆలోచన మరోలా ఉంది. ఇటువంటి వారి విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్లాలని యువ నాయకత్వం భావిస్తోంది. అందుకే గనుల లీజు విషయంలో మై హోమ్ గ్రూపునకు డోర్ క్లోజ్ అయినట్లు సమాచారం.
0 Comments