క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలతో పాటు అర్జున అవార్డులను కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలు అర్జున అవార్డుకు ఎన్నికయ్యారు. కాగా జివాంజి దీప్తి పారాలంపిక్స్లో మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరికి కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రీడా అవార్డులను ప్రదానం చేయనున్నారు.
0 Comments