గుజరాత్ లోని పోర్బందర్ తీరంలో ఇండియన్ కోస్టల్ గార్డ్కు చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్స్ ఉన్నట్లు భావిస్తున్నట్లు ఐసీజీ అధికారులు వెల్లడించారు. ఈ హెలికాప్టర్ ప్రయాణం ప్రారంభం నుంచే సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కొద్ది సేపటికే అది కూలిపోయింది. దీనిపై కోస్ట్ గార్డ్ ఇప్పటకికే దర్యాప్తు చేపట్టింది. ఏఎల్హెచ్, హెలికాప్టర్లలో కీలకమైన రక్షణ చర్యలకు హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ చర్యలు చేపట్టింది. గత సంవత్సరం కూడా ఈ శ్రేణి హెలికాప్టర్లు ప్రమాదాలకు గురయ్యాయి. వీటిల్లో డిజైన్ సమస్యలు ఉండటంతో చాలా చోట్ల ఉపయోగించడం లేదు.
0 Comments