Ad Code

వేల కోట్ల రూపాయలు సంపాదించా - ఏం చేయాలో అర్థం కావడం లేదు : వినయ్ హిరేమత్


న్‌లైన్ ఉచిత స్క్రీన్ రికార్డింగ్ సాధనాలను అందించే లూమ్ సహ వ్యవస్థాపకుడు వినయ్ హిరేమత్ 2023లో తన స్టార్టప్ లూమ్‌ను 975 మిలియన్ డాలర్లకు (రూ. 8368.59 కోట్లు) విక్రయించారు. అప్పటి నుంచి తనకు ఏం చేయాలో తోచడం లేదన్నారు. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకున్నారు. ఇప్పుడు తన వద్ద చాలా డబ్బు ఉందని, కానీ తన జీవితంలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కంపెనీని అమ్మిన తర్వాత డబ్బు సంపాదించాలన్నా, హోదా సాధించాలన్నా కోరిక లేకుండా పోయిందన్నారు. వినయ్ హిరేమత్ 1991లో జన్మించాడు. ఆయన యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్, ఉర్బానా-ఛాంపెయిన్‌లో చదువు ప్రారంభించాడు. కానీ రెండేళ్ల తర్వాత చదువు మానేశాడు. దీని తర్వాత ఆయన కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకు వెళ్లాడు. స్టార్టప్‌లలో కెరీర్‌ను కొనసాగించాలని కలలు కన్నాడు. మొదట్లో వినయ్ సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ అయిన బ్యాక్‌ప్లేన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఇంటర్న్‌గా ఉన్న షాహెద్ ఖాన్‌ను కలుసుకున్నాడు. తరువాత అతనితో కలిసి లూమ్‌ను స్థాపించాడు. ప్రారంభ రోజులలో లూమ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కేవలం రెండు వారాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఈ కష్ట సమయాల్లో హిరేమత్ తన క్రెడిట్ కార్డును పూర్తిగా ఉపయోగించుకుని కంపెనీని కాపాడుకున్నాడు. లూమ్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీటీఓగా ఆయన $200 మిలియన్ల నిధిని సేకరించాడు.ఆ క్రమంలోనే ఆయన నాయకత్వంలో లూమ్ వినియోగదారుల సంఖ్య 3 కోట్లు దాటింది. ఆ తర్వాత 2023లో లూమ్‌ను విక్రయించారు. స్టార్టప్ అమ్మిన తర్వాత 'రెడ్ వుడ్స్ 'కి వెళ్లి మళ్లీ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించాడు. కానీ డజన్ల కొద్దీ పెట్టుబడిదారులు, రోబోటిక్ నిపుణులను రెండు వారాల పాటు కలుసుకున్నప్పటికీ, ఆయన వారిని ఆకర్షించడంలో విఫలమయ్యాడు. ఆ తరువాత అతను ఎటువంటి అనుభవం లేకుండా హిమాలయాలను అధిరోహించడానికి బయలుదేరాడు. చివరకు అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. తర్వాత వినయ్ హవాయికి వెళ్లాడు. ఇప్పుడు ఫిజిక్స్ చదువుతున్నాడు. వాస్తవ ప్రపంచానికి సంబంధించిన విషయాలను సృష్టించే కంపెనీని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సంస్థ లూమ్ స్థాయికి చేరకపోయినా.. తనకు ఆత్మస్థైర్యాన్ని అందించాలని, ఇదే తన కోరిక అని అంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu