తెలంగాణలో భవనాలు, లే అవుట్ల అనుమతులకు 'బిల్డ్ నౌ' పేరుతో కొత్త ఆన్లైన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 'బిల్డ్ నౌ' పేరుతో ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు మంగళవారం ప్రారంభించారు. ''పట్టణాభివృద్ధిలో గతంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖ ప్రాధాన్యతపై దృష్టి పెట్టి.. స్వయంగా సీఎం రేవంత్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేరుస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నాం. స్థిరాస్తి రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. హైదరాబాద్ ప్రజలే గృహ రుణాలు అధికంగా తీసుకుంటున్నారు'' అని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.
0 Comments