నిన్నటితో పోలిస్తే ఇవాళ పసిడి ధరలో భారీ మార్పు వచ్చింది. శనివారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.79,140గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారమైతే రూ.73,100 పలుకుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే రూ.500 వరకు ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరల నుంచి ఎట్టకేలకు ఈరోజు ఉపశమనం లభించింది. రేట్లలో ఈ మార్పునకు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణమని తెలుస్తోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.3 వేల మేరకు పడిపోవడం గమనార్హం. కిలో వెండి ధర రూ.1,01,000 దగ్గరకు దిగొచ్చింది.
0 Comments