Ad Code

బస్సు మురికి కాలవలో పడి ఎనిమిది మంది మృతి


పంజాబ్‌లోని భటిండాలోని జీవన్ సింగ్ వాలా సమీపంలో ప్రయాణికులతో నిండిన ఓ బస్సు వంతెనపై నుండి నేరుగా మురికి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 50 మంది ప్రయాణికులతో నిండిన బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికులు, అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టి బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటికి తీసే ప్రయత్నం చేయడంతో చాలామంది బతికి బయట పడ్డారు. ఈ ప్రమాదం భటిండా-శార్దుల్‌గఢ్ లోకల్ రూట్‌లో ఓ ప్రైవేట్ రవాణా సంస్థకు చెందిన బస్సు ప్రమాదానికి గురవడంతో జరిగింది. బస్సు వంతెనపై నుంచి కింద పడటంతో ఈ తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu