Ad Code

న్యూఢిల్లీలో జనవరి 19 నుంచి భారత్‌ బ్యాటరీ షో 2025 !


న్యూఢిల్లీలో జనవరి 19 నుంచి 21 వరకు రెండో విడత 'భారత్‌ బ్యాటరీ షో 2025' నిర్వహించనున్నారు. భారత్‌తో పాటు అమెరికా, జపాన్, చైనా తదితర దేశాల నుంచి వందకు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ రంగంలో అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సుమారు 50 దేశాల నుంచి 5,00,000 మంది పైగా సందర్శకులు దీన్ని సందర్శించనున్నట్లు ‍ప్రభుత్వం వివరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయన్స్‌ (ఐఈఎస్‌ఏ) ఈ మెగా కార్యక్రమానికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రధానంగా లిథియం అయాన్‌ బ్యాటరీలు, బ్యాటరీ విడిభాగాలు, టెస్టింగ్‌ సొల్యూషన్స్, తయారీ పరికరాలు, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్‌ సొల్యూషన్స్‌ మొదలైన వాటిని ప్రదర్శించనున్నారు. బ్యాటరీ టెక్‌ పెవిలియన్, సప్లై చెయిన్‌ పెవిలియన్, ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రా పెవిలియన్‌ మొదలైన ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయని ఐఈఎస్‌ఏ ప్రెసిడెంట్‌ దేవి ప్రసాద్‌ దాష్‌ తెలిపారు. ఐఈఎస్‌ఏ జనవరి 16-17 మధ్య ఇండియా బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ సప్లై చెయిన్‌ సదస్సును (ఐబీఎంఎస్‌సీఎస్‌), జనవరి 18న ఇండియా బ్యాటరీ రీసైక్లింగ్‌ అండ్‌ రీ-యూజ్‌ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు. 

Post a Comment

0 Comments

Close Menu