Ad Code

11 కేవీ విద్యుత్‌ వైర్లపై దూకిన కోతి : తెగి బైకుపై పడి ముగ్గురు దుర్మరణం !


త్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌ నివాసి తన కుమార్తె, మేనకోడలుతో కలిసి బైకుపై బయటికి వచ్చాడు. వారు సోన్‌బర్సా మార్కెట్‌ ఏరియాలోని డంపింగ్‌ యార్డు దగ్గరికి చేరుకోగానే, వారి పైనున్న 11 కేవీ విద్యుత్‌ వైర్లపై కోతి దూకింది. దాంతో ఓ వైర్‌ తెగి బైక్‌పై పడింది. దాంతో ముగ్గురూ విద్యుత్‌ అఘాతానికి గురయ్యారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో ముగ్గురూ అగ్నికి ఆహుతయ్యారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కోతి దూకడంవల్లే విద్యుత్‌ వైర్‌ తెగిపడిందని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని విద్యుత్‌ అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu