ఉత్తరప్రదేశ్లోని గోరక్పూర్ నివాసి తన కుమార్తె, మేనకోడలుతో కలిసి బైకుపై బయటికి వచ్చాడు. వారు సోన్బర్సా మార్కెట్ ఏరియాలోని డంపింగ్ యార్డు దగ్గరికి చేరుకోగానే, వారి పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లపై కోతి దూకింది. దాంతో ఓ వైర్ తెగి బైక్పై పడింది. దాంతో ముగ్గురూ విద్యుత్ అఘాతానికి గురయ్యారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో ముగ్గురూ అగ్నికి ఆహుతయ్యారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కోతి దూకడంవల్లే విద్యుత్ వైర్ తెగిపడిందని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించామని విద్యుత్ అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0 Comments