పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోవడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సిలిగురి నుంచి గ్యాంగ్ టక్ వెళ్తుండగా అదుపు తప్పి ట్రావెల్స్ బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
0 Comments