ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 20వ తేదీ ఏపీలో ఖాళీ అయిన మూడు స్థానాలతో పాటు, ఒడిశా, హర్యానా, పశ్చిమ బెంగాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల, 10 వరకూ నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు, 20న రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు, 20నే సాయంత్రం 5 గంటలకు ఫలితాల వెల్లడి.
0 Comments