గూగుల్ పే దీపావళి పండుగ సందర్భంగా యూజర్ల కోసం బిగ్ ఆఫర్ను అమలు చేస్తోంది. నవంబరు 7వ తేదీ వరకు ఆ ఆఫర్ అమల్లో ఉండనుంది. యూజర్లకు రూ.51 నుంచి రూ.1,001 దాకా నగదు బహుమతిని అందజేస్తుంది. ఇందుకోసం యూజర్లు ఆరు రకాల లడ్డూలను డిపాజిట్ చేయాలి. నిత్యం గూగుల్ పేని ఉపయోగించే వారు ఈ ఆఫర్కు అర్హులు. యూజర్లు వివిధ పేమెంట్స్ చేసినప్పుడు గూగుల్ నుంచి లడ్డూ రివార్డులు లభిస్తాయి. క్యాష్బ్యాక్ను పొందాలంటే గూగుల్ యూజర్లు కనీసం ఆరు లడ్డూలను సేకరించి సబ్మిట్ చేయాలి. అక్టోబర్ 21న ప్రారంభమైన ఈ ఆఫర్ నవంబర్ 7 వరకు అమల్లో ఉంటుంది. యూపీఐ ద్వారా కనీసం రూ.3000 క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించినా లడ్డూలు లభిస్తాయి. గూగుల్ పే యాప్లోని ఆఫర్లు, రివార్డుల విభాగానికి వెళ్లి మన వద్ద ఎన్ని లడ్డూలు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్కు సంబంధించిన మొత్తం సమాచారం కూడా అక్కడ లభిస్తుంది.
0 Comments