Ad Code

మణిపూర్‌కు 50 సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ కంపెనీలు పంపనున్న కేంద్రం !


ణిపూర్‌లోమళ్లీ జాతి హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను సమీక్షించారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మరో 50 కంపెనీల బలగాలను పంపాలని నిర్ణయించారు. 35 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌), 15 కంపెనీల సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) బలగాలను పంపనున్నారు. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించడం ఇది రెండోసారి. నవంబర్ 12న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 20 సీఏపీఎఫ్‌ (15 సీఆర్పీఎఫ్‌, 5 బీఎస్‌ఎఫ్‌) యూనిట్లను మణిపూర్‌కు పంపింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు 218 కంపెనీల బలగాలున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu