చైనా మార్కెట్ లో ఒప్పో పాడ్ 3 లాంచ్ అయింది. తక్కువ ఫీచర్లతో కూడిన ఈ ట్యాబ్ను తీసుకొచ్చారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ట్యాబ్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒప్పో ప్యాడ్ 3లో 11.61 ఇంచెస్తో కూడిన స్క్రీన్ను అందించారు. 2800x2000 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్తో పాటు 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ను అందించారు. ఈ ట్యాబ్లో 9510 ఎమ్ఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఈ పాడ్ 3లో 8 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 67 వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 9510 ఎమ్ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇచ్చారు. ఇందులో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.
0 Comments