ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ. 54,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో విడుదల చేయబడింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రూ. 24,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 30,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ ను అందుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పై 6 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ ను కూడా అందించింది. శాంసంగ్ గెలాక్సీ S23 FE స్మార్ట్ ఫోన్ సూపర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 12MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 10MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ తో 24 fps వద్ద UHD 8K (7680 x 4320) వీడియోలు షూట్ చేయవచ్చు మరియు గొప్ప స్టన్నింగ్ ఫోటోగ్రఫీ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ శాంసంగ్ సొంత చిప్ సెట్ Exynos 2200 తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 8GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 6.4 ఇంచ్ Dynamic AMOLED 2X పవర్ ఫుల్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు సన్ లైట్ లో కూడా కనిపించేలా అధిక బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రెమ్ పటిష్టంగా ఉంటుంది మరియు స్క్రీన్ పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
0 Comments