Ad Code

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి !


ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని పేర్కొంది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకను జరపనున్నారు. 'యువగళం' పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి నారాలోకేశ్‌ తెలిపారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి ప్రజలు పాదయాత్రలో విజ్ఞప్తి చేశారని గుర్తు చేసిన ఆయన.. ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు వచ్చాయన్నారు. అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu