సెంట్రల్ కోల్కతాలోని శనివారంనాడు జరిగిన పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ పేలుడుతో ఫుట్పాత్పై జీవనం సాగించే 58 ఏళ్ల బపిదాస్ అనే రాగ్పికర్ గాయపడ్డాడు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు ఈ పేలుడు జరగడంతో తల్టాల పోలీస్ స్టేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఎన్ఆర్ఎస్ ఆసుపత్రికి తరలించినట్టు స్టేషన్ ఆఫీస్ ఇన్చార్జి తెలిపారు. బ్లాచ్మాన్ వీధి ప్రవేశమార్గం వద్ద ఒక ప్లాస్టిక్ గోనెసంచీని కనుగొన్నట్టు చెప్పారు. నిరసనలతో అట్టుడికిన ఆర్జే కర్ మెడికల్ ఆసుపత్రి వద్ద ఎవరికీ చెందని బ్యాగు ఒకటి కలకలం సృష్టించిన మరుసటి రోజే సెంట్రల్ కోల్కతాలో ఈ పేలుడు ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, సెంట్రల్ కోల్కతాలో శనివారం జరిగిన పేలుడు ఘటనపై ఎన్ఐఏతో కానీ ఇతర సెంట్రల్ ఏజెన్సీలతో కానీ దర్యాప్తు జరిపించాలని పశ్చిమబెంగాల్ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర చీఫ్ సుకాంత మజుందార్ కేంద్ర మంత్రి అమిత్షాకు లేఖ రాశారు. పేలుడుకు కారణంపై విచారణ జరిపేందుకు స్థానిక పోలీసుల పరిధి పరిమితంగా ఉంటుందని, ఘటన తీవ్రత, ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.
0 Comments