Ad Code

సెప్టెంబర్ 17న "తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం"


సెప్టెంబర్ 17 "తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం"గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొంది. నైజాం రాష్ట్ర ప్రజలకు 1949, సెప్టెంబర్ 17న నిజాం అరాచక పాలన నుంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా విముక్తి కలిగించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 మీద వివాదాలు నెలకొంటున్నాయి. నైజాం ప్రజలకు విముక్తి కలిగిన రోజును ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలో ఒక ఖచ్చితమైన పేరేమీ లేదు దీంతో ఎవరికి నచ్చింది వారు చేస్తూ వచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సెప్టెంబర్ 17పై కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను "తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం" పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలను ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజు రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని తెలియ జేసింది. ఆరోజు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం జెండా ఆవిష్కరించగా.. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వం కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసే ప్రజాప్రతినిధుల వివరాల లిస్టును ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu